Andhra Pradesh: ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

Andhra Pradesh registers 104 new Corona cases
  • చిత్తూరు జిల్లాలో 18 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఒకరి మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,249
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18 కేసులు నమోదయ్యాయి. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నెల్లూరు జిల్లాలో కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు.

ఇక ఇదే సమయంలో 133 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,76,410కి పెరిగింది. ఇప్పటి వరకు 20,60,672 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,249 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 14,489 మంది మృతి చెందారు.
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News