కేశినేని నానికి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

Chandrababu appointed Kesineni Nani as party coordinator in Vijayawada West
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించారు. అంతేకాదు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఎంపీ కేశినేని నానిని నియమించారు. రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా చిరుమామిళ్ల మధుబాబుకు అవకాశం ఇచ్చారు. మాచర్ల నియోజకవర్గం ఇన్చార్జిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి, విశాఖ సౌత్ నియోజకవర్గం ఇన్చార్జిగా గండి బాబ్జిలను నియమించారు.

కాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని నానికి మరింత స్వేచ్ఛ కల్పించారు. డివిజన్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసే అధికారాన్ని కట్టబెట్టారు. గతంలో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా నియమించిన కమిటీలను పక్కనబెట్టాలని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా నియామకాలకు, నిర్ణయాలకు పార్టీ అధినేత చంద్రబాబు ఆమోదముద్ర వేశారు.
Go Back to Shorts
Chandrababu
Kesineni Nani
Party Coordinator
Vijayawada West
TDP
Andhra Pradesh

More Telugu News