Team India: దక్షిణాఫ్రికా చేరుకున్న టీమిండియా క్రికెటర్లు

  • ఈ నెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్
  • కోహ్లీ నాయకత్వంలో సఫారీ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు
  • ఫొటోలు పంచుకున్న బీసీసీఐ
Team India arrives South Africa

సఫారీలతో మూడు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా దక్షిణాఫ్రికా పయనమైన సంగతి తెలిసిందే. కాగా, టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా చేరుకున్నారంటూ బీసీసీఐ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఎయిర్ పోర్టులో ఆటగాళ్ల ఫొటోలను పంచుకుంది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ఆటగాళ్లు మాస్కులు ధరించడంతో పాటు ముఖాలను కవర్ చేస్తూ ఫేస్ షీల్డులను కూడా ధరించారు.  

ఈ నెల 26న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత క్రికెట్లో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, విదేశీ గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్ లో టీమిండియా ఆటతీరు ఎలా ఉంటుందోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News