Nitya Menen: ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పాను... అప్పుడు నా గురించి తప్పుగా రాశారు: నిత్యా మీనన్

  • ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి అడిగారు
  • అప్పుడు ప్రభాస్ ఎవరో నాకు తెలియదు
  • ఓ జర్నలిస్టు నా గురించి చాలా తప్పుగా రాశాడు
Nithya Menen shares about her bad experience

తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెపుతూ నిత్యామీనన్ ఓ విషయాన్ని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... 2011లో 'అలా మొదలైంది' చిత్రం విడుదల తర్వాత తాను ఒక ఇంటర్వ్యూకి వెళ్లానని... అక్కడ ప్రభాస్ గురించి తనను అడిగారని... వాస్తవానికి ఆ సమయంలో ప్రభాస్ ఎవరో తనకు తెలియదని... అదే విషయాన్ని వాళ్లకు చెప్పానని తెలిపింది.

తన సమాధానం విని వాళ్లు షాకయ్యారని, తనను ఆట పట్టించారని చెప్పింది. ఆ తర్వాత ఆ విషయాన్ని ఓ జర్నలిస్టు పెద్దదిగా చేస్తూ తన గురించి తప్పుగా రాశారని... దీంతో తాను చాలా హర్ట్ అయ్యానని తెలిపింది. ఆ వార్తలతో తాను చాలా కుంగిపోయానని చెప్పింది.

More Telugu News