Car: చిత్తూరు జిల్లాలో రోడ్డుపై కారు దగ్ధం.... ఆరుగురి దుర్మరణం

  • కల్వర్టును ఢీకొన్న కారు 
  •  కారులో మంటలు
  • ఐదుగురు అక్కడిక్కడే మృతి
  • మృతుల్లో చిన్నారి
  • పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ఘటన
Car caught in fire as five charred to death

చిత్తూరు జిల్లాలో ఈ మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. పూతలపట్టు-నాయుడుపేట హైవేపై ఓ కారు దగ్ధమైంది. అగరాల వద్ద కారు మంటల్లో చిక్కుకుంది. వేగంగా వచ్చిన కారు ఓ కల్వర్టును ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఐదుగురు సజీవ దహనం కాగా, ఆసుపత్రిలో మరొకరు మృతి చెందారు. మరణించిన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. మరో ఇద్దరు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. కారు నెంబరు AP39 HA 4003 అని గుర్తించారు.

More Telugu News