ఉప్పల్ భూముల వేలానికి భారీ స్పందన... చదరపు గజం రూ.1 లక్ష పైనే!
- కొంతకాలంగా తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం
- తాజాగా ఉప్పల్ భూముల వేలం
- తొలిరోజు 23 ప్లాట్ల వేలం
- హెచ్ఎండీఏకి రూ.141.61 కోట్ల ఆదాయం
తొలి రోజు వేలం ముగియగా, 23 ప్లాట్లకు వేలం నిర్వహించారు. వీటిలో రెండు ప్లాట్లకు అదిరిపోయే ధర లభించింది. చదరపు గజం నిర్ధారిత ధర రూ.35 వేలు కాగా, తాజా వేలంలో రూ.1.01 లక్షల ధర పలకడం విశేషం. హెచ్ఎండీఏకి ఇవాళ మొత్తం రూ.141.61 కోట్ల ఆదాయం లభించింది.
ఈసారి వేలంలో లోకల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ఇతరులు కూడా పాల్గొన్నారు. ఇవాళ 23 ప్లాట్లు వేలంలో ఉంచారు. రేపు మరో 23 ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు.