కడప జిల్లాలో వరద బాధితులపై సీఎం జగన్ వరాల జల్లు
- కడప జిల్లాలో జలవిలయం
- రాజంపేట మండలంలో వరద బీభత్సం
- పులపుత్తూరులో వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ
- వారితో నేరుగా మాట్లాడిన వైనం
పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లిస్తామని, పొలంలో ఇసుక మేటలు తొలగించేందుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుక మేటల తొలగింపు కోసం హెక్టారుకు రూ.12 వేలు సాయం అందిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల గోడును విన్నారు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయామని, డ్వాక్రా డబ్బులు చెల్లించలేమని వరద బాధిత మహిళలు నిస్సహాయత వ్యక్తం చేశారు. దాంతో, సీఎం జగన్ స్పందిస్తూ, రుణ చెల్లింపులపై ఏడాదిపాటు మారటోరియం విధిస్తామని భరోసా ఇచ్చారు.