రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న 150 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్
- కర్ణాటక ధార్వాడ్ లోని మెడికల్ కాలేజీలో కలకలం
- తరగతుల రద్దు.. హాస్టళ్ల మూసివేత
- ఇటీవలే కాలేజీలో జరగిన ఓ ఈవెంట్
కరోనా బారిన పడిన విద్యార్థులను హాస్టల్ లోనే క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేయిస్తున్నామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితీష్ పాటిల్ తెలిపారు. ఇటీవలే ఈ కాలేజీలో ఓ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమం వల్లే విద్యార్థులు కరోనా బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బెంగళూరు సిటీలోని ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్లో 33 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకింది.