డైరెక్టర్ కామెంటరీతో 'రిపబ్లిక్' సినిమా స్ట్రీమింగ్... జీ5 ఓటీటీలో కొత్త ఒరవడి
- ఇటీవల థియేటర్లలో విడుదలైన రిపబ్లిక్
- దేవ్ కట్టా దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా చిత్రం
- నవంబరు 26న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
- డైరెక్టర్ కామెంటరీతో స్ట్రీమింగ్
ఈ సినిమా నవంబరు 26న జీ5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. అది కూడా దర్శకుడు దేవ్ కట్టా కామెంటరీతో! వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే 'జీ5' ఓటీటీ వేదిక... డైరెక్టర్ కామెంటరీతో 'రిపబ్లిక్' సినిమాను విడుదల చేయాలనే సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.