Andhra Pradesh: ఏపీలో మరో 196 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 26,119 కరోనా పరీక్షలు
  • కృష్ణా జిల్లాలో 34 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 2,159 మందికి చికిత్స
AP Corona Report

ఏపీలో గడచిన 24 గంటల్లో 26,119 కరోనా పరీక్షలు నిర్వహించగా, 196 మందికి పాజిటివ్ అని తేలింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 29, పశ్చిమ గోదావరి జిల్లాలో 21, గుంటూరు జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 242 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,567 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 20,54,979 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,159 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,429కి పెరిగింది.

More Telugu News