CM Jagan: చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడిందని మావాళ్లు అంటున్నారు: సీఎం జగన్

  • కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • మహిళా సాధికారత అంశంపై సీఎం జగన్ ప్రసంగం
  • బీఏసీ సమావేశానికి చంద్రబాబు హాజరుకాలేదని వెల్లడి
  • బాబు కోసం బీఏసీ భేటీ ఆలస్యం చేశామని వివరణ
  • అయినప్పటికీ రాలేదని వ్యాఖ్యలు
CM Jagan comments on Chandrababu during assembly sessions

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారత అంశంపై సీఎం జగన్ ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళల సర్వతోముఖాభివృద్ధిని ఓ ఉద్యమంలా భావించి అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ రెండున్నరేళ్ల కాలం మహిళా సాధికారత అంశం పరంగా ఓ సువర్ణ అధ్యాయం అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విపక్షనేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు బీఏసీ సమావేశానికి హాజరుకాలేదని జగన్ తెలిపారు. చంద్రబాబు వస్తారేమోనని బీఏసీ సమావేశాన్ని కొంచెం సేపు ఆలస్యం చేశామని, అయినప్పటికీ ఆయన రాలేదని తెలిపారు. ఆయనకు ఏ కష్టం వచ్చిందో తనకైతే తెలియదని అన్నారు. అయితే 'చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడిందని మావాళ్లు అంటున్నారు' అని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడం తెలిసిందే.

More Telugu News