చిత్తూరు జిల్లాలో వర్ష బీభత్సం... తిరుపతి నగరం జలమయం
- బంగాళాఖాతంలో వాయుగుండం
- చిత్తూరు జిల్లాపై ప్రభావం
- తిరుపతిలో పలు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు
- రహదారులు జలమయం కావడంతో స్తంభించిన రాకపోకలు
- జిల్లాలో పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవు
వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండడంతో చిత్తూరు జిల్లాలో పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హరినారాయణన్ వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా జిల్లాకు తీసుకువచ్చినట్టు వివరించారు.