దొంగ ఓట్ల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు: చంద్రబాబుపై బొత్స విసుర్లు
- కుప్పం మున్సిపాలిటీలో విజయంపై బొత్స ధీమా
- ఓడిపోతామని తెలిసే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి
- కుప్పంకు చంద్రబాబు ఏంచేశారన్న బొత్స
- తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని వ్యాఖ్యలు
గత 40 ఏళ్లుగా కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఇప్పుడు మేం నీళ్లు ఇవ్వలేదని ఆరోపించడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా చంద్రబాబు కుప్పంకు ఏంచేశారు? ఆయనా మాపై విమర్శలు చేసేది? అని నిలదీశారు.