పని ప్రారంభించిన రాహుల్ ద్రావిడ్... కివీస్ తో సిరీస్ కు టీమిండియా కఠోర సాధన
- రేపటి నుంచి టీమిండియా, న్యూజిలాండ్ సిరీస్
- తొలి టీ20 మ్యాచ్ కోసం టీమిండియా సన్నాహాలు
- రోహిత్ శర్మకు త్రోడౌన్లు విసిరిన ద్రావిడ్
- కొత్త కోచ్, కొత్త కెప్టెన్ కలయికలో సిరీస్ కు సిద్ధమైన భారత్
ఈ నెల 17న భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు సన్నాహాలు షురూ చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా, ద్రావిడ్ స్వయంగా త్రోడౌన్లు విసిరి సహకరించాడు. ద్రావిడ్ సమక్షంలో భారత క్రికెటర్లు ఎంతో ఉత్సాహంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీసు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.