రావణుడు విమానంలో శ్రీలంక నుంచి భారత్ కు ప్రయాణించాడా...?: శ్రీలంక ప్రభుత్వం పరిశోధన
- రామాయణ గాథలో విమానం ప్రస్తావన
- రావణుడి వద్ద ఉండేదని ఇతిహాసాల్లో పేర్కొన్న వైనం
- రెండేళ్ల కిందట పరిశోధన ప్రారంభించిన శ్రీలంక ప్రభుత్వం
- భారత్ కూడా చేయి కలపాలని విజ్ఞప్తి
దీనిపై పరిశోధన కోసం లంక ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించింది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ పరిశోధనకు మధ్యలోనే ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో 2022లో పరిశోధన పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు, ఈసారి తమ పరిశోధనలో భారత బృందం కూడా పాలుపంచుకోవాలని శ్రీలంక వర్గాలు ఆకాంక్షను వ్యక్తం చేశాయి. కాగా రావణుడి గాథలో విమానం అంశం ఓ కట్టుకథ అని చాలామంది కొట్టిపారేస్తుండడం తెలిసిందే.