Maha Padayatra: రైతుల మహా పాదయాత్రలో పేలిన సిలిండర్... ఇద్దరికి తీవ్ర గాయాలు

  • అమరావతి కోసం రైతుల పాదయాత్ర
  • తుళ్లూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర
  • ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర
  • ఒక్కసారిగా పేలిన బెలూన్లకు గాలినింపే సిలిండర్
Cylinder explosion in Maha Padayatra

అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ్టికి రైతుల పాదయాత్ర 15వ రోజుకు చేరింది. కాగా, ప్రకాశం జిల్లా చిరికూరపాడు వద్ద పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. బెలూన్లకు గాలి నింపే సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది.

ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే కందుకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించినట్టు సమాచారం. కాగా, నేటి పాదయాత్ర కందుకూరు మండలం విక్కిరాలపేటలో ముగిసింది.

More Telugu News