Andhra Pradesh: ఏపీలో కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Daily Cases report
  • గత 24 గంటల్లో 32,630 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు
  • కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 4 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 3,086 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 32,630 కరోనా పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 32, గుంటూరు జిల్లాలో 19, నెల్లూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో నాలుగు కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 247 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,69,978 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,52,477 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,086 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,415కి పెరిగింది.
Andhra Pradesh
Corona Virus
Daily Bulletin
Today Cases

More Telugu News