అంతర్జాతీయ సదస్సుకు సీఎం జగన్ ను ఆహ్వానించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం
- భారత్ లో పర్యటిస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు
- ఫోరం అధ్యక్షుడితో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ
- సీఎం జగన్ పరిపాలన తీరును వివరించిన మంత్రి
- వచ్చే ఏడాది జనవరిలో దావోస్ లో సదస్సు
బ్రెండేకు గౌతమ్ రెడ్డి ఏపీ సీఎం జగన్ పరిపాలన తీరును వివరించారు. కరోనా సంక్షోభ సమయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక విధానం తదితర అంశాలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బ్రెండే ప్రత్యేకంగా ప్రశంసించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు 2022 జనవరి 17, 22 తేదీల మధ్య జరగనుంది.