Andhra Pradesh: పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. బోటు షికారుకు గ్రీన్ సిగ్నల్!

  • కరోనాతో ఆగిపోయిన బోటు ప్రయాణాలు
  • పాపికొండలు, భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తిరిగి బోటు షికారు
  • ఏర్పాట్లు చేయాలని ఏపీటీడీసీ ఆదేశం
  • ఏడో తేదీ నుంచి అందుబాటులోకి
APTDC said Good news to Tourists

పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నదుల్లో బోటు షికారుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల ఏడో తేదీ నుంచి పాపికొండలు, భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో బోట్లు నడపనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో మూతబడిన పర్యాటకం తిరిగి తెరుచుకుంటుండడంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, బోట్లపై నియంత్రణ, పర్యవేక్షణ కోసం 9 చోట్ల ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లు సమర్థంగా పనిచేసేలా రెవెన్యూ, పోలీస్, విపత్తుశాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. అలాగే, హోటళ్లు, రిసార్టులు, ఇతర సందర్శనీయ ప్రాంతాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కూడా సత్యనారాయణ ఆదేశించారు.

More Telugu News