తెలంగాణలో నిన్న స్వల్ప భూప్రకంపనలు.. మహారాష్ట్రలో భూకంప కేంద్రం
- మూడు నుంచి ఐదు సెకన్ల పాటు కంపించిన భూమి
- భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
- రిక్టర్ స్కేలుపై 4.3గా తీవ్రత నమోదు
పెద్దపల్లి జిల్లా ముత్తారం, రామగుండం మండలాల్లోనూ భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెగుళ్లపల్లితోపాటు రంగాపురంలో రాత్రి 7 గంటల సమయంలో మూడు సెకన్ల పాటు ప్రకంపనలు కనిపించింది.
అలాగే, మల్హర్ మండలం కుంభపల్లి, దుగ్గొండి మండలంలోని రేకంపల్లి, కొత్తపల్లి (బి), మానేరు పరీవాహక ప్రాంతంలో రాత్రి ఏడున్నర గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి కేంద్రంగా భూకంపం వచ్చిందని, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.3గా నమోదైందని అధికారులు తెలిపారు.