Chiranjeevi: 'వాల్తేర్ వీర్రాజు'లో చిరూ జోడిగా శ్రుతి హాసన్!

  • 'సలార్' సినిమాతో బిజీగా శ్రుతి హాసన్  
  • బాలకృష్ణ సినిమాలోను అవకాశం
  • చిరూ సినిమా కోసం సంప్రదింపులు
  • దాదాపు ఖాయమైనట్టేననే టాక్
Valther Veerraju movie update

చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండగానే, ఆ తరువాత ప్రాజెక్టును చిరంజీవి లైన్లో పెట్టేస్తున్నారు. ఆయన తరువాత ప్రాజెక్టుగా 'భోళా శంకర్' సెట్స్ పైకి వెళ్లనుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చేనెల రెండవ వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.

ఆ వెంటనే నాలుగైదు రోజుల గ్యాపులో రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను ఎంపిక చేశారు. 'సైరా' తరువాత చిరంజీవితో తమన్నా చేస్తున్న సినిమా ఇది. ఇక ఈ సినిమా తరువాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి 'వాల్తేర్ వీర్రాజు' సినిమాను చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కనుంది.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ .. చరణ్ .. బన్నీతో కలిసి నటించిన శ్రుతి హాసన్, ఈ సారి మెగాస్టార్ తోనే చేయనుందన్న మాట. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన నాయికగా 'సలార్' చేస్తోంది. బాలకృష్ణ తరువాత సినిమా హీరోయిన్ గా కూడా ఆమె పేరే వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News