కర్నూలు జిల్లాలో వైసీపీకి చెందిన రెండు కుటుంబాల మధ్య దాడులు... పలువురికి గాయాలు
- ఆరేకల్లు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
- ఏడుగురికి తీవ్ర గాయాలు
- ఇంటి నిర్మాణం సందర్భంగా పక్కింటి వద్ద రాళ్లు పడటంతో గొడవ
మాటామాటా పెరిగి... ఇరు కుటుంబాలు దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. దాడుల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.