కర్నూలు జిల్లాలో వైసీపీకి చెందిన రెండు కుటుంబాల మధ్య దాడులు... పలువురికి గాయాలు

Two YSRCP families fights in Kurnool district
  • ఆరేకల్లు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
  • ఏడుగురికి తీవ్ర గాయాలు
  • ఇంటి నిర్మాణం సందర్భంగా పక్కింటి వద్ద రాళ్లు పడటంతో గొడవ
కర్నూలు జిల్లాలో వైసీపీ పార్టీకి మద్దతుదారులైన రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. కర్రలతో కొట్టుకున్నాయి. ఈ ఘటన ఆరేకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గ్రామంలో లక్ష్మన్న ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనున్న తిమ్మారెడ్డి ఇంటి దగ్గర రాళ్లు పడ్డాయి. దీంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది.

మాటామాటా పెరిగి... ఇరు కుటుంబాలు దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. దాడుల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Kurnool District
YSRCP Families
Fight

More Telugu News