Nagasourya: 'వరుడు కావలెను' నుంచి హుషారైన పాట!

  • ప్రేమ - పెళ్లి చుట్టూ తిరిగే కథ
  • జనంలోకి వెళ్లిన పాటలు
  • దర్శకురాలిగా లక్ష్మీసౌజన్య పరిచయం
  • ఈ నెల 29వ తేదీన విడుదల  
Vaddaanam Video Song Released

ప్రేమ - పెళ్లి ప్రధానంగా సాగే సినిమాల్లో సందడి ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సందడి చేయడానికి సిద్ధమవుతున్న సినిమాగా 'వరుడు కావలెను' కనిపిస్తోంది. నాగశౌర్య - రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమాకి, లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. "వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు .. వయ్యారం చిమ్మేసే అందాల బొమ్మలు' అంటూ ఈ పాట సాగుతోంది.

ఈ పాటను చాలా కలర్ ఫుల్ గా .. బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. తమన్ స్వరపరిచిన ఈ పాట జోరుగా .. హుషారుగా సాగుతోంది. హీరోహీరోయిన్ల మధ్య పరిచయం ఈ పెళ్లి మంటపం నుంచే మొదలవనుందని అర్థమవుతోంది. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా .. ఆ అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.

More Telugu News