Rickshaw Puller: రూ. 3 కోట్లు చెల్లించాలంటూ రిక్షా పుల్లర్ కు ఐటీ నోటీసులు

  • ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘటన
  • నోటీసులపై పోలీసులను ఆశ్రయించిన రిక్షా పుల్లర్
  • కేసు నమోదు చేయలేమన్న పోలీసులు
IT officers issues notices to rickshaw puller

రిక్షా తొక్కుకుని జీవనం సాగించే వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. ఏ పూట తింటారో, ఏ పూట పస్తులు ఉంటారో కూడా వారికి తెలియదు. ఏరోజుకు ఆరోజు వారిది బతుకు పోరాటమే. అలాంటి ఓ రిక్షా పుల్లర్ కు ఐటీ శాఖ అధికారులు రూ. 3 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపారు. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

 మథురలోని బకల్ పూర్ ప్రాంతంలోని అమర్ కాలనీకి చెందిన ప్రతాప్ సింగ్ కు ఈ నోటీసులు వచ్చాయి. దీంతో, ఆయన పోలీసులను ఆశ్రయించాడు. అయితే రిక్షాపుల్లర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేమని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థంకాక తనకు అందిన నోటీసులను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News