భారత్-ఇంగ్లండ్ మధ్య ఆగిపోయిన ఐదో టెస్టు జులైలో.. రీషెడ్యూల్ చేసిన ఈసీబీ

India vs Engaland fifth test rescheduled to july next year july
  • కరోనా కారణంగా ఆగిపోయిన చివరి టెస్టు
  • జులై 1న ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి టెస్టు
  • అనంతరం టీ20, వన్డే సిరీస్
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగిపోయిన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేస్తున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. వచ్చే ఏడాది జులైలో ఇరు జట్ల మధ్య ప్రారంభం కానున్న వన్డే, టీ 20 సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్టు తెలిపింది.

గత నెల 10-14 మధ్య మాంచెస్టర్‌లో జరగాల్సిన ఈ టెస్టు కరోనా కారణంగా వాయిదా పడింది. భారత జట్టు బృందంలోని సహాయక సభ్యులకు కరోనా సోకడంతో భారత జట్టు మైదానంలోకి దిగేందుకు నిరాకరించింది.

ఈ నేపథ్యంలో ఈ టెస్టు రీషెడ్యూలుకు బీసీసీఐ అప్పట్లోనే ప్రయత్నించినప్పటికీ సందిగ్ధత మాత్రం వీడలేదు. తాజాగా ఈ టెస్టును జులై ఒకటో తేదీకి రీ షెడ్యూల్ చేసినట్టు ఈసీబీ ప్రకటించింది. ఈ సిరీస్‌లో భారత జట్టు ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది.

జులై 1-5 మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో ఈ టెస్టు జరుగుతుందని, అనంతరం  7న ఏజీస్ బౌల్‌లో తొలి టీ20, 9న ఎడ్జ్‌బాస్ట్‌లో రెండో టీ20, ట్రెంట్ బ్రిడ్జ్‌లో 10న మూడో టీ20 జరుగుతాయి. ఆ తర్వాత జులై 12న కియా ఓవల్‌లో తొలి వన్డే, లార్డ్స్‌లో 4న రెండో వన్డే, ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మూడో వన్డే జరుగుతాయి.
Go Back to Shorts
Team India
England
Fifth Test
Edgbaston
ECB
BCCI

More Telugu News