'మా' ఎన్నికల్లో ఓటు వేయని నటులు వీరే!
- ముగిసిన 'మా' ఎన్నికల పోలింగ్
- కొనసాగుతున్న కౌంటింగ్
- ఈసారి భారీగా ఓట్లు
- ఓటింగ్ దూరంగా ఉన్న అగ్రతారలు
రవితేజ, అనుష్క, హన్సిక, ఇలియానా, రకుల్ ప్రీత్ సింగ్, సత్యదేవ్, అల్లు శిరీష్, శర్వానంద్, నాగచైతన్య, రానా, సుశాంత్, సునీల్, సుమంత్, నిహారిక, త్రిష తదితరులు ఓటు హక్కు వినియోగించుకోలేదని సమాచారం. షూటింగులు, ఇతర కారణాలతో వారు ఓటింగ్ కు రాలేకపోయినట్టు తెలుస్తోంది.
కాగా, నేడు ఓటేసిన వారిలో సీనియర్ నటి జయప్రద కూడా ఉన్నారు. రోజా, జెనీలియా తదితరులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.