దసరాకు ఏపీ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడకు నాలుగు ప్రత్యేక రైళ్లు

South Central Railway announce 4 special trains to dasara passengers
దసరా పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, కాకినాడ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. ఇందులో సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ (07456), నర్సాపూర్-సికింద్రాబాద్ స్పెషల్ (07455), సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ (07053), కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (07054) ఉన్నాయి.

సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ ఈ నెల 14న రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ 17న సాయంత్రం 6 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. అలాగే, సికింద్రాబాద్‌-కాకినాడ టౌన్‌ స్పెషల్‌ రైలు 14న రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుతుంది. కాకినాడ టౌన్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ 17న రాత్రి 8.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Go Back to Shorts
South Central Railway
Secunderabad
Narsapur
Kakinada Town

More Telugu News