Chandrababu: బీసీ ఫెడరేషన్ కన్వీనర్ గా కొల్లు రవీంద్రను నియమించిన చంద్రబాబు
అన్ని స్థాయిల్లోనూ పార్టీని బలోపేతం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలో టీడీపీ అనుబంధ విభాగాల నియామకాలు ఖరారు చేశారు. టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముస్తాక్ అహ్మద్ ను నియమించారు. టీడీపీ బీసీ ఫెడరేషన్ కన్వీనర్ గా కొల్లు రవీంద్రను నియమించారు. యువత కోసం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ను కొత్తగా ఏర్పాటు చేసిన చంద్రబాబు ఆ విభాగానికి తేజస్విని పొడపాటిని అధ్యక్షురాలిగా నియమించారు.