తాలిబన్ల షాకింగ్ నిర్ణయం.. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం!

Talibans ban IPL in Afghanistan
  • ఐపీఎల్ ను ప్రసారం చేయవద్దని మీడియాకు తాలిబన్ల ఆదేశాలు
  • మ్యాచ్ లు జరిగే స్టేడియంలలో మహిళలు ఉంటారని వ్యాఖ్య
  • చీర్ లీడర్లు డ్యాన్స్ చేస్తారని అభ్యంతరం
బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రపంచంలో లో జరిగే టీ20 టోర్నీల్లో ఐపీఎల్ కే అత్యధిక క్రేజ్ ఉంటుంది. ఈ టోర్నీలో ఆడేందుకు అన్ని దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లందరూ ఉవ్విళ్లూరుతుంటారు. అయితే, ఐపీఎల్ ను తమ దేశంలో ప్రసారం చేయవద్దంటూ ఆప్ఘనిస్థాన్ పాలన చేపట్టిన తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మీడియా సంస్థలను ఆదేశించారు.

అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి వారు చెప్పిన కారణం మరీ విడ్డూరంగా ఉండటం గమనార్హం. ఐపీఎల్ జరిగే స్టేడియంలో మహిళా ప్రేక్షకులు ఉంటారని, మ్యాచ్ ల సందర్భంగా యువతులు (చీర్ లీడర్లు) డ్యాన్స్ చేస్తారని... అందుకే ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేస్తున్నట్టు తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్ ను చేజిక్కించుకున్నప్పటి నుంచి మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల గౌరవాన్ని కాపాడతామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ... ఆ మేరకు వారు ఏ మాత్రం వ్యవహరించడం లేదు. అన్ని రకాల క్రీడలకు మహిళలను దూరం చేశారు. ఇంటికే పరిమితం కావాలని, పురుషుల తోడు లేకుండా ఇంటి గడప కూడా దాటరాదని హుకుం జారీ చేశారు. 
Go Back to Shorts
IPL
Afghanistan
Taliban
Ban

More Telugu News