తడిచిపోయిన బ్యాలెట్ పేపర్లు.. తాడికొండలో నిలిచిన కౌంటింగ్
- బేజ్తాపురం, రావెలలో ఘటన
- తడిచిపోయి పనికిరాకుండా పోయిన బ్యాలెట్లు
- మరికొన్ని పేపర్లకు చెదలు
- లెక్కింపుపై కొనసాగుతున్న ఉత్కంఠ
ఎన్నికలు ముగిసిన తర్వాత చాలాకాలం పాటు బాక్సులు చీకటి గదుల్లో ఉండిపోవడం వల్లే వాటికి చెదలు పట్టినట్టు తెలుస్తోంది. మొత్తం బాక్సులను తెరిస్తే కానీ ఎన్ని బ్యాలెట్లు పాడైపోయాయన్న విషయం తెలియదని సిబ్బంది తెలిపారు. కాగా, బ్యాలెట్లు తడిచిపోయి పనికిరాకుండా పోవడంతో బేజాత్పురం, రావెల స్థానాల్లో రీపోలింగ్ నిర్వహిస్తారా? లేక, కౌంటింగ్ కొనసాగిస్తారా? అన్న విషయం తెలియరాలేదు.