Sapthagiri: ఆసక్తికరంగా 'గూడుపుఠాణి' ట్రైలర్!

  • సప్తగిరి హీరోగా 'గూడుపుఠాణి'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • కథానాయికగా నేహా సోలంకి పరిచయం
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు  
Gudupitani Trailer released

తెలుగు తెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్స్, ఆ తరువాత హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాంటివారి జాబితాలో బ్రహ్మానందం .. అలీ .. సునీల్ తరువాత ఇప్పుడు సప్తగిరి కనిపిస్తున్నాడు. ఆల్రెడీ సప్తగిరి హీరోగా కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'గూడుపుఠాణి' రూపొందింది.

శ్రీనివాస రెడ్డి - రమేశ్ యాదవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, కె. ఎమ్. కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో నేహా సోలంకి కథానాయికగా పరిచయమవుతోంది. కుంచె రఘు విలన్ గా నటించిన ఈ  సినిమా నుంచి నిన్న రాత్రి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

గ్రామీణ నేపథ్యంలో ఒక ప్రేమజంట చుట్టూ తిగిగే కథ ఇది. ఆ గ్రామంలో ప్రతినాయకుడి కారణంగా వాళ్లకి ఎదురయ్యే అవరోధాలు .. వాళ్లు ఎలా అధిగమించారనేదే ఈ కథ. ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More Telugu News