'సలార్' కోసం భారీ యాక్షన్ ఎపిసోడ్!
- విడుదలకి రెడీ అవుతున్న 'రాధే శ్యామ్'
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
- షూటింగు దశలో 'సలార్'
- కథానాయికగా శ్రుతి హాసన్
ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, 'సలార్'ను పూర్తిచేసే పనిలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. గత రెండు షెడ్యూల్స్ లోను యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించిన ప్రశాంత్ నీల్, మూడవ షెడ్యూల్ ను కూడా యాక్షన్ సీన్స్ కోసమే కేటాయించాడట.
ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ కీలకం .. సినిమాలో సగం బడ్జెట్ వాటి కోసమే కేటాయించారు. ఒక వైపున కరోనా, మరో వైపున వర్షాల కారణంగా తరువాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ అలరించనున్న సంగతి తెలిసిందే.