Corona Virus: ఏపీలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా వ్యాప్తి!

  • క్రమంగా పెరుగుతున్న రోజువారీ కేసులు
  • గత 24 గంటల్లో 67,911 కరోనా పరీక్షలు
  • 1,608 మందికి పాజిటివ్
  • చిత్తూరు జిల్లాలో 281 కొత్త కేసులు
  • రాష్ట్రంలో తాజాగా 6 మరణాలు
  • ఇంకా 15,119 మందికి చికిత్స
Corona spreading raising again in AP

ఏపీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 67,911 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,608 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 మందికి కరోనా నిర్ధారణ కాగా, నెల్లూరు జిల్లాలో 261, తూర్పు గోదావరి జిల్లాలో 213, కృష్ణా జిల్లాలో 161, పశ్చిమ గోదావరి జిల్లాలో 154 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 1,107 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,27,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,98,561 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,119 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,970కి పెరిగింది.

More Telugu News