PM Modi: పారాలింపిక్స్ పతకధారులతో ముచ్చటించిన ప్రధాని నరేంద్ర మోదీ

  • ఇటీవల ముగిసిన టోక్యో పారాలింపిక్స్
  • 19 పతకాలు సాధించిన భారత్
  • వాటిలో 5 స్వర్ణాలు
  • ఢిల్లీలో పారా అథ్లెట్లతో భేటీ
PM Modi interacts with Paralympic medal winners

ఇటీవలే ముగిసిన టోక్యో పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబర్చారు. 5 స్వర్ణ పతకాల సహా మొత్తం 19 పతకాలు సాధించి అంతర్జాతీయ యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. కాగా, పారాలింపిక్స్ లో విశేషంగా రాణించి పతకాలు నెగ్గిన భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు కలిశారు.

 దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పారాలింపిక్స్ పతకధారులతో ఆయన ఆప్యాయంగా ముచ్చటించారు. టోక్యో క్రీడోత్సవ విశేషాలను వారిని అడిగి తెలుసుకున్నారు. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారంటూ పేరుపేరునా అభినందించారు. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు.

More Telugu News