MLA Ravindranath Reddy: సీబీఐ విచారణ వివరాలు వెల్లడించిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

MLA Ravindranath Reddy talks to media after CBI questioning in Viveke murder case
షార్ట్స్‌లో చూడండి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని సీబీఐ అధికారులు నిన్న విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణ వివరాలను రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో పంచుకున్నారు. వివేకా బంధువును కావడంతో తనను కూడా విచారణకు పిలిచారని వెల్లడించారు. తనకు తెలిసిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు వివరించానని తెలిపారు.

వివేకాతో తన సంబంధాలపై ప్రశ్నించారని, ఆయన ఎలా నడుచుకునేవారంటూ ఆరా తీశారని పేర్కొన్నారు. ఎంతో అవమానంగా ఉంది, కేసు త్వరగా తేల్చండి అని సీబీఐ అధికారులను కోరానని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరలో కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీబీఐ అధికారులు బదులిచ్చారని వివరించారు.
Go Back to Shorts
MLA Ravindranath Reddy
CBI
YS Vivekananda Reddy
Murder Case
YSRCP
Andhra Pradesh

More Telugu News