Krishna District: కృష్ణా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై బాలుడు సహా ముగ్గురు వ్యక్తుల అత్యాచారం

  • పశువుల పాకలోకి తీసుకెళ్లి అత్యాచారం
  • నిందితుల అరెస్ట్
  • మచిలీపట్టణం జిల్లా ఆసుపత్రికి బాలిక తరలింపు
girl gang raped in krishn dist

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జిల్లాలోని కృత్తివెన్ను మండలంలోని ఓ పంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. 14 ఏళ్ల బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన వివాహితుడైన పి.అనంతబాబు, జి.తరుణ్‌తోపాటు ఓ బాలుడు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

గురువారం రాత్రి తమ ఇంటి సమీపంలోని పశువుల పాకలోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి బంటుమిల్లి ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ కోర్టుకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను మచిలీపట్టణం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News