అది ఫేక్ న్యూస్: రతన్ టాటా వివరణ
- సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఫేక్ వార్తలు
- తాజాగా రతన్ టాటా పేరిట న్యూస్ వైరల్
- తాను ఆ మాట చెప్పలేదన్న రతన్ టాటా
'ఆధార్ కార్డు ఆధారంగా మద్యం అమ్మకాలు చేపట్టాలి. మద్యం కొనేవారికి ప్రభుత్వ సబ్సిడీలు అందించకూడదు. ఆల్కహాల్ కొనేవారు ఆహారాన్ని కూడా కొనుక్కోగలరు. మనం వారికి ఉచితంగా ఆహారాన్ని ఇస్తే... వారు మద్యం కొనుగోలు చేస్తున్నారు' అని రతన్ టాటా చెప్పినట్టు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వార్తలపై రతన్ టాటా స్పందించారు. ఈ మాటలు తానెప్పుడూ చెప్పలేదని, ఇది ఫేక్ న్యూస్ అని ఆయన వివరణ ఇచ్చారు.