KCR: మోదీతో భేటీ అయిన కేసీఆర్

  • నదీ జలాల అంశంపై చర్చించే అవకాశం
  • విభజన చట్టంలోని పెండింగ్ అంశాల ప్రస్తావన 
  • గత డిసెంబర్ లో మోదీని చివరి సారి కలిసిన కేసీఆర్
KCR meets Modi

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ తో పాటు... తెలంగాణకు చెందిన పలు అంశాలపై ప్రధానితో ఆయన చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

గత ఏడాది డిసెంబర్ లో మోదీతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ప్రధానిని ఆయన కలవలేదు. అకాల వర్షాల కారణంగా హైదరాబాదులో రోడ్లు, మౌలిక వసతులు దెబ్బతిన్నాయని... వాటిని పునర్నిర్మించేందుకు ఆర్థిక సాయాన్ని అందించాలని ఆ సందర్భంగా ప్రధానిని కోరారు.

More Telugu News