నాపై పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం.. కేసీఆర్, హరీశ్రావులకు ఈటల సవాల్
- కేసీఆర్ ధర్మంతో పెట్టుకున్నారు
- టీఆర్ఎస్ పరిస్థితి ఆరిపోయే దీపంలా ఉంది
- కేసీఆర్తో అనుబంధం వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానన్న ఈటల
బెదిరింపులు, అహంకారం, డబ్బులతో హుజూరాబాద్లో పరిస్థితిని అటుదిటు మార్చడం కేసీఆర్ జేజమ్మ తరం కూడా కాదన్నారు. బక్కపల్చగా ఉన్న ఈటల అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడని, ధర్మం కోసం, న్యాయం కోసం దేన్నైనా త్యాగం చేసే సత్తా ఉన్నోడని ఈటల అన్నారు. ధర్మంతో పెట్టుకున్న కేసీఆర్ కు పతనం తప్పదని హెచ్చరించారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని, రాష్ట్రంలో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఇదేనని అన్నారు. కేసీఆర్తో తనకు 18 సంవత్సరాల అనుబంధం ఉందని, కాబట్టే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని అన్నారు. రాజీనామా చేయమంటే ముఖం మీద కొట్టి వచ్చానని ఈటల పేర్కొన్నారు.