Amara Raja Group: ‘అత్యంత శక్తిసామర్థ్య యూనిట్‌’ పురస్కారాన్ని అందుకున్న ‘అమరరాజా’

Amara Raja Batteries bags the Excellent Energy Efficient Unit award
  • సంస్థలోని చిన్న బ్యాటరీల ప్లాంట్‌కు మరో అవార్డు
  • ఈ నెల 24 -27 మధ్య 30 మంది న్యాయనిర్ణేతల పర్యవేక్షణలో పోటీలు
  • పోటీపడిన 400 పరిశ్రమలు

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన 22వ జాతీయ అవార్డుల పోటీల్లో అమరరాజా బ్యాటరీస్‌కు ‘అత్యంత శక్తి సామర్థ్య యూనిట్ (ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్) పురస్కారం లభించింది. దేశవ్యాప్తంగా 9 విభిన్న రంగాల నుంచి 400 పరిశ్రమలు పోటీ పడగా ఈ నెల 24 నుంచి 27 వరకు వర్చువల్ సమావేశం ద్వారా 30 మంది న్యాయ నిర్ణేతల పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో చిత్తూరు జిల్లాలోని అమరరాజా గ్రోత్ కారిడార్‌లో ఉన్న ఆటోమోటివ్ యూనిట్‌కు ఇంజినీరింగ్ కేటగిరీ కింద ఈ అవార్డు లభించింది. అలాగే, అదే సంస్థకు మరో అవార్డు కూడా దక్కింది. అమరరాజా బ్యాటరీస్‌లోని చిన్న బ్యాటరీల డివిజన్ ప్లాంట్‌కు ‘ఇన్నోవేటివ్ ప్రాజెక్టు అవార్డు’ లభించింది. న్యూమాటిక్ సిలిండర్ సైజు ఆప్టిమైజేషన్ చేయడం ద్వారా ఈ అవార్డును కైవసం చేసుకుంది. సీఐఐ నుంచి రెండు అవార్డులు లభించడంపై సంస్థ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ సి.నరసింహులు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News