పారాలింపిక్స్లో భారత్కు తొలి పతకం.. రజతంతో సరిపెట్టుకున్న భవీనాబెన్ పటేల్
- వరుస విజయాలతో ఫైనల్కు
- చైనా క్రీడాకారిణి ఝౌతో జరిగిన పోరులో పరాజయం
- టేబుల్ టెన్నిస్లో పతకం సాధించిన తొలి ఇండియన్గా రికార్డు
మొన్న బ్రెజిల్కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్లో 3-0తో అద్వితీయ విజయం సాధించి క్వార్టర్స్లో అడుగుపెట్టిన భవీనాబెన్.. ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్కు చేరుకుంది. నిన్న చైనాకు చెందిన మియావో జాంగ్తో జరిగిన సెమీఫైనల్లో 3-2తో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఫలితంగా నిన్ననే భారత్కు తొలి పతకం ఖాయమైంది.