Team India: హెడింగ్లే టెస్టులో ఓటమి అంచున భారత్

  • 215/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్
  • వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన వైనం
  • 42 పరుగుల తేడాతో 6 వికెట్లు డౌన్
  • రాబిన్సన్ కు 5 వికెట్లు
Team India lost quick wickets in Headingley

హెడింగ్లేలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ ఓటమికి చేరువలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో 215-2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన భారత్ నాటకీయంగా వికెట్లు కోల్పోయింది. 42 పరుగుల తేడాతో 6 వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 97 ఓవర్లలో 8 వికెట్లకు 257 పరుగులు. రవీంద్ర జడేజా, బుమ్రా క్రీజులో ఉన్నారు.

అంతకుముందు, పుజారాను అవుట్ చేయడం ద్వారా భారత్ పతనానికి ఓల్లీ రాబిన్సన్ శ్రీకారం చుట్టాడు. సెంచరీకి 9 పరుగుల దూరంలో పుజారా అవుట్ కాగా, ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ కోహ్లీ (55), రహానే (10) కూడా వెనుదిరిగారు. పంత్ కేవలం 1 పరుగు చేసి నిరాశపరిచాడు. రాబిన్సన్ కు 5 వికెట్లు లభించాయి.

భారత్ ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉన్న నేపథ్యంలో చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. పరిస్థితి చూస్తే ఇంగ్లండ్ మరోసారి బ్యాటింగ్ కు దిగాల్సిన అవసరం రాకపోవచ్చు.

More Telugu News