Andhra Pradesh: ఏపీలో కొత్తగా 1,515 కేసుల నమోదు

  • 24 గంటల్లో కరోనా కారణంగా 10 మంది మృతి
  • 20,09,245కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,050
AP registers 1515 corona cases in 24 hours

ఏపీలో కరోనా కేసులు ఒక రోజు పెరిగితే, మరోరోజు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,515 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,788కి పెరిగింది. తాజా కేసులతో పాటు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,09,245కి చేరింది. వీరిలో 19,80,407 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,050 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 68,865 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు.

More Telugu News