KKR: ఐపీఎల్ మ్యాచ్: దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన కోల్ కతా

  • ఐపీఎల్ లో నేడు కోల్ కతా × పంజాబ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • 4 ఓవర్లలో 59 పరుగులు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్
KKR gets flashy start against PBKS

ఐపీఎల్ లో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదిక. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా జట్టు దూకుడుగా ఆడుతోంది. ఆ జట్టు 4 ఓవర్లలోనే 59 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ 24, సునీల్ నరైన్ 32 పరుగులతో ఆడుతున్నారు. 

ఈ మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టులో పలు మార్పులు జరిగాయి. లియామ్ లివింగ్ స్టన్ స్థానంలో జానీ బెయిర్ స్టో తుదిజట్టులోకి వచ్చాడు. మరోవైపు, కోల్ కతా జట్టులో ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. స్టార్క్ వేలికి గాయం కావడంతో, అతడి స్థానంలో దుష్మంత చమీరను జట్టులోకి తీసుకున్నారు.

More Telugu News