Joe Root: హెడింగ్లే టెస్టులో రూట్ సెంచరీ... 250 దాటిన ఇంగ్లండ్ ఆధిక్యం

  • హెడింగ్లేలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • సూపర్ ఫామ్ లో రూట్
  • సొంతగడ్డపై శతకం
  • 3 వికెట్లకు 349 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • ఇంగ్లండ్ ఆధిక్యం 271 పరుగులు
Root makes another ton

హెడింగ్లే టెస్టులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప టీమిండియా గట్టెక్కడం కష్టమే! తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీ నమోదు చేయగా, ఆతిథ్య జట్టు భారీ స్కోరు దిశగా సాగిపోతోంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 3 వికెట్లకు 349 పరుగులు కాగా, రూట్ 102 పరుగులతోనూ, జానీ బెయిర్ స్టో 29 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 271కి చేరింది. ఆటకు ఇవాళ రెండో రోజే! ఈ నేపథ్యంలో టీమిండియా ముందు రేపు భారీ టార్గెట్ నిలిపేందుకు ఇంగ్లండ్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News