Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బాలీవుడ్ పై దృష్టి పెట్టిన సమంత 
  • 'గాడ్ ఫాదర్'లో మలయాళ నటుడు
  • తమిళ దర్శకుల సంయుక్త నిర్మాణం  
Samantha wants to do more projects in Bollywood

*  అందాలతార సమంత బాలీవుడ్ ప్రాజక్టులపై దృష్టి పెడుతోంది. ఈ విషయం గురించి ఈ చిన్నది తాజాగా చెబుతూ, బాలీవుడ్ ప్రాజక్టులు చేయడానికి నేను సిద్ధంగా వున్నాను. అయితే, ఇంతకుముందు నేను చేయనటువంటి క్యారెక్టర్లతో కూడిన కథలు రావాలి. ఆ పాత్ర చేయాలి అని నాకు వెంటనే అనిపించాలి. అలాంటివి వస్తే కనుక తప్పకుండా చేస్తాను' అని చెప్పింది. ఇదిలావుంచితే, ప్రస్తుతం కొన్నాళ్ల పాటు ఈ ముద్దుగుమ్మ బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే.
*  మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా 'గాడ్ ఫాదర్' పేరిట రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు బిజూ మీనన్ కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం.
*  ప్రముఖ తమిళ దర్శకులు మణిరత్నం, శంకర్, మురుగదాస్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, మిస్కిన్ కలసి సంయుక్తంగా చిత్ర నిర్మాణాన్ని చేబడుతున్నారు. ఇందుకోసం 'రైన్ ఆన్ ఫిలిమ్స్' అనే బ్యానర్ ను నెలకొల్పారు. ఈ బ్యానర్ పై ముఖ్యంగా ఓటీటీ వేదికల కోసం చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా వీరు నిర్మించే తొలి చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తాడట.  

More Telugu News