TSMDC: తెలంగాణలో రేపు రాత్రి వరకు ఇసుక బుకింగ్ నిలిపివేత

  • నిన్న రాత్రి 9 గంటల నుంచి ఆగిపోయిన ఎస్ఎస్ఎంఎంఎస్ 
  • వార్షిక నిర్వహణలో భాగంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటన
  • సోమవారం నుంచి యథాతథంగా కార్యకలాపాలు
Sand booking suspension in Telangana till tomorrow night

తెలంగాణలో రేపు రాత్రి వరకు ఇసుక బుకింగ్ ను నిలిపివేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. వార్షిక నిర్వహణలో భాగంగా గత రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు శాండ్ సేల్ మేనేజింగ్ మానిటరింగ్ సిస్టం (ఎస్ఎస్ఎంఎంఎస్) పనిచేయదని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ప్రకటించింది. ఈ సమయంలో ఇసుక బుకింగ్, లోడింగ్, ఉండదని స్పష్టం చేసింది. సోమవారం నుంచి మళ్లీ కార్యకలాపాలు యథతథంగా ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరింది.

More Telugu News