Curfew: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి పూట‌ కర్ఫ్యూను మ‌రోసారి పొడిగించిన స‌ర్కారు

curfew extends in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేద‌న్న విష‌యం తెలిసిందే. వైర‌స్  విజృంభ‌ణ త‌గ్గ‌క‌పోవ‌డంతో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను మ‌రోసారి రాష్ట్ర‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఈ రోజు  ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 4 వ‌ర‌కు ప్ర‌తిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని , రాత్రి స‌మ‌యంలో క‌రోనా ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా, ఏపీలో ప్ర‌తిరోజు దాదాపు 1,500 కేసులు న‌మోద‌వుతోన్న విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
Curfew
Andhra Pradesh
Corona Virus

More Telugu News