ITBP: ఆఫ్ఘన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన మూడు మిలటరీ శునకాలు

  • 2019లో కాబూల్‌లో విధుల్లో చేరిన స్నిఫర్  డాగ్స్
  • హర్యానాలోని ఎన్‌టీడీసీ భాను శిక్షణా శిబిరంలో ట్రైనింగ్
  • భారత దౌత్యవేత్తలతోపాటు ఎంబసీలో పనిచేసే ఆఫ్ఘన్ పౌరులనూ కాపాడిన జాగిలాలు 
ITBP K9 dogs serving in Afghanistan return back to India

ఆఫ్ఘనిస్థాన్‌లో మూడేళ్ల పాటు సేవలందించిన మూడు శునకాలు తిరిగి భారత్‌కు చేరుకున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ)కి చెందిన కే9 జాగిలాలు - మాయ, బాబీ, రూబిలను 2019లో కాబూల్ పంపించారు. వీటికి హర్యానాలోని ఎన్‌టీడీసీ భాను శునక శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఇది దేశంలోని అత్యుత్తమ శునక శిక్షణా కేంద్రాల్లో ఒకటి.

భారత వాయుసేకు చెందిన సీ-17 ఎయిర్‌క్రాప్ట్‌లో ఈ శునకాలను కాబూల్ నుంచి గుజరాత్ తీసుకొచ్చినట్లు సమాచారం. ఇక్కడి జామ్ నగర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఆ విమానం ల్యాండయింది. బుధవారం ఈ శునకాలు ఢిల్లీలోని ఐటీబీపీ చావాలా క్యాంపుకు చేరుకున్నాయి. మూడేళ్ల పాటు భారత రాయబార కార్యాలయంలో అధికారులతోపాటు, అక్కడ పనిచేసే ఆఫ్ఘన్ పౌరులకు ఇవి రక్షణ కల్పించాయి. 

More Telugu News