Telangana: తెలంగాణ హైకోర్టు జడ్జిల నియామకాలకు ఏడుగురిని ప్రతిపాదించిన సుప్రీంకోర్టు కొలీజియం.. జాబితాలో ఉన్న పేర్లు ఇవిగో!

  • ఆగస్ట్ 17న సుప్రీంకోర్టు కొలీజియం సమావేశం
  • జాబితాను అధికారికంగా విడుదల చేసిన సుప్రీంకోర్టు
  • నలుగురు మహిళలను సిఫారసు చేసిన కొలీజియం
SC announces seven recommendations for elevation to Telangana High Court

న్యాయాధికారుల కోటాలో తెలంగాణ హైకోర్టుకు జడ్జిలుగా ఏడుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. ఆగస్ట్ 17న జరిగిన కొలీజియం సమావేశంలో వీరి పేర్లను సిఫారసు చేసినట్టు ఒక ప్రకటనను సుప్రీంకోర్టు విడుదల చేసింది. కొలీజియం సిఫారసు చేసిన వారిలో పి. శ్రీసుధ, సి.సుమలత, డాక్టర్ జి.రాధారాణి, ఎం. లక్ష్మణ్, ఎన్. తుకారాంజీ, ఎ.వెంకటేశ్వరరెడ్డి, పి. మాధవి దేవి ఉన్నారు.

More Telugu News